Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది

Khairatabad Maha Ganapati Immersion Concludes Grandly

Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది:లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఘనంగా ముగిసింది. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు శనివారం హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరాడు.

లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తీసుకొచ్చారు.

లక్షలాది మంది భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ చేసిన నినాదాల మధ్య గణేశుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని కడసారి దర్శించుకున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది.

దారి పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని కడసారి దర్శించుకున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది.

Read also:Facebook : ఫేస్‌బుక్ ‘పోక్’ ఫీచర్: పాత ట్రెండ్‌కు కొత్త హంగులు

 

Related posts

Leave a Comment